- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BIG NEWS: మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ.. మిసిర్ బెస్రా సంచలన నిర్ణయం..?

దిశ, వెబ్డెస్క్: జార్ఖండ్ మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. డివిజనల్ కమిటీ సభ్యుడు అశ్విన్ అలియాస్ లచ్చూతో సహా.. ఐదుగురు కీలక మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన అశ్విన్.. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా గంగలూరు ఏరియాకు చెందిన వ్యక్తి. 2014లో బస్తర్ నుంచి జార్ఖండ్కు వెళ్లిన పది మంది సభ్యులలో లచ్చూ ఒకరు. వీరిలో ఇప్పటికే కొందరు ఎన్కౌంటర్లలో మరణించగా, మరికొందరు అరెస్టయ్యారు. మావోయిస్టు అగ్రనేత మిసిర్ బెస్రా అడ్డుకున్నా.. వెళ్లవద్దని వారించినా వినకుండా లచ్చూ బయటకు రావడం గమనార్హం. ప్రస్తుతం దండకారణ్యంలో కొనసాగుతున్న భారీ లొంగుబాట్ల పర్వానికి ప్రభావితమై.. హింసను వీడి శాంతి మార్గంలోకి రావాలని లచ్చూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరి లొంగుబాటుతో జార్ఖండ్ అడవుల్లో మావోయిస్టుల పట్టు మరింత సడలినట్లయింది. ప్రభుత్వ పునరావాస పథకాల పట్ల ఆకర్షితులయ్యే వీరు బయటకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
భారీ సెర్చ్ ఆపరేషన్ నడుమ దళంలో చీలిక
ఇక మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు మిసిర్ బెస్రా లక్ష్యంగా భారీ సెర్చ్ ఆపరేషన్ నడుస్తున్న ఈ టైంలో.. ఆయన దళంలో చీలిక ఏర్పడిందనే ప్రచారం సంచలనంగా మారింది. వివిధ కారణాలతో బెస్రా టీమ్లో ఏర్పడిన విబేధాల వల్ల లచ్చూతో సహా.. ఐదుగురు కీలక మావోయిస్టులు లొంగిపోయారని తెలుస్తోంది. బెస్రాతో ప్రస్తుతం అసీమ్ మండల్, సచిన్ మాండీ వంటి కొద్దిమంది నేతలు మాత్రమే అడవుల్లో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో సంస్థాగతంగా పెరుగుతున్న విభేదాలు మావోయిస్టు పార్టీని మరింత బలహీనపరుస్తున్నట్లు చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మావోయిస్టులకు మద్దతు కూడా తగ్గిపోవడంతో మిసిర్ బెస్రా.. త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటారా లేక సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుత లొంగుబాట్లు అంతర్గత విభేదాల కారణంగా జరిగినట్లు సమాచారం. విభేదాల నేపథ్యంలో బెస్రా దళంలోని పలువురు మావోయిస్టులు లొంగిపోయారని తెలుస్తోంది. ఇక జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లా సారండా అటవీ ప్రాంతంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాల ఒత్తిడి వల్లే మిసిర్ బెస్రా లక్ష్యంగా పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన దళం బలహీనపడిందనే ప్రచారం జరుగుతోంది.ఈ పరిణామం మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.






