మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-27 04:31:59  IST  )

మహారాష్ట్ర ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతిమహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.

మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతిమహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గెవ్రాయ్ పట్టణానికి సమీపంలోని ధూలే-సోలాపూర్ జాతీయ రహదారి గాంధీ వంతెనపై ట్రక్కు ఢీకొని ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందారు. అయితే, ముందుగా ఓ ఎస్‌యూవీ వాహనం డివైడర్‌ను ఢీ కొట్టింది. వాహనాన్ని డివైడర్ నుంచి తొలగించడానికి ప్రయాణికులు వాహనం దిగుతుండగా, వేగంగా వస్తున్న ట్రక్కు వారిపైకి దూసుకెళ్లింది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులను బీడ్ జిల్లా జియోారాయ్‌కు బాలు అత్కరే, భగవత్ పరాల్కర్, సచిన్ నన్నవ్రే, మనోజ్ కరాండే, కృష్ణ జాదవ్, దీపక్ సూరయ్యగా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story