మేం దొంగలమా...? మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? : సీఎం

by S Gopi |   (  Updated:2023-02-18 16:31:38  IST  )

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం దొంగలమా అంటూ పరోక్షంగా... Maharashtra Cm hits out at Uddhav Thackeray

మేం దొంగలమా...? మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? : సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం దొంగలమా అంటూ పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే... ఏక్ నాథ్ షిండే ఈరోజు మీడియాతో మాట్లాడుతూ పరోక్షంగా ఉద్ధవ్ థాక్రేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు, వందలాది మంది ప్రజాప్రతినిధులు, లక్షల కార్మికులం దొంగలమా,..? మీరు ఏం మాట్లాడుతున్నారా మీకు అర్థమవుతుందా..? మీరు మాట్లాడేదానిపై మీకు మీకు అంతర్మథనం చేసుకోవాలని ఆయన ఉద్ధవ్ థాక్రేపై పరోక్షంగా మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఈరోజు సాయంత్రం ఉద్ధవ్ థాక్రే కార్యకర్తలతో మాట్లాడుతూ... పార్టీ సింబల్ ను ఓ దొంగ ఎత్తుకుపోయాడని, ఆ దొంగకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందంటూ ఏక్ నాథ్ షిండేపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

Next Story