ఓయో రూమ్‌లో దారుణం.. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ ఫరీదాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓయో హోటల్‌కు పిలిచిన ప్రియుడు.. ప్రియురాలిని గొంతు పిసికి చంపేశాడు. 32 ఏళ్ల షీబా.. ఐసిఐసిఐ బ్యాంక్ ఉద్యోగి కాగా పదేళ్లుగా దీపక్‌తో ప్రేమలో ఉంది. ఈ క్రమంలోనే ఐపీ కాలనీలోని ఓయో హోటల్‌లో కలిశారు.

ఓయో రూమ్‌లో దారుణం.. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ఫరీదాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓయో హోటల్‌కు పిలిచిన ప్రియుడు.. ప్రియురాలిని గొంతు పిసికి చంపేశాడు. 32 ఏళ్ల షీబా.. ఐసిఐసిఐ బ్యాంక్ ఉద్యోగి కాగా పదేళ్లుగా దీపక్‌తో ప్రేమలో ఉంది. ఈ క్రమంలోనే ఐపీ కాలనీలోని ఓయో హోటల్‌లో కలిశారు. అయితే పెళ్లి చేసుకోవాలని షీబా ఒత్తిడి చేయడంతో ఆగ్రహంతో అక్కడే ఆమెను చంపేసి వెళ్లిపోయాడు. షీబా తల్లి రజియా ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో షీబా మరో మతానికి చెందిన అమ్మాయని.. తనను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయడంతోనే చంపినట్లు నిందితుడు అంగీకరించాడు.

Next Story