Utthra Pradesh : లోక్‌స‌భ ఎంపీకి రూ.1.91 కోట్ల జరిమానా

by Muthe.Rajitha |

యూపీ(UP)లోని సంభ‌ల్ లోక్‌స‌భ ఎంపీ(Sambhal Loksabha MP) జియా ఉర్ రెహ్మాన్‌(Jia Ur Rehman)కు ఆ రాష్ట్రం భారీ జరిమానా విధించింది.

Utthra Pradesh : లోక్‌స‌భ ఎంపీకి రూ.1.91 కోట్ల జరిమానా
X

దిశ, వెబ్ డెస్క్ : యూపీ(UP)లోని సంభ‌ల్ లోక్‌స‌భ ఎంపీ(Sambhal Loksabha MP) జియా ఉర్ రెహ్మాన్‌(Jia Ur Rehman)కు ఆ రాష్ట్రం భారీ జరిమానా విధించింది. విద్యుత్ చోరీ(Electricity theft) ఘ‌ట‌న‌లో.. ఆ రాష్ట్ర విద్యుత్తు శాఖ 1.91 కోట్ల జ‌రిమాన విధించడమే కాకుండా.. విద్యుత్తు చ‌ట్టం సెక్షన్ 135(Electricity Act Section 135) ప్రకారం కేసు నమోదు చేశారు. ఎంపీ ఇంటికి విద్యుత్తు స‌ర‌ఫ‌రాను కూడా నిలిపివేశారు. విద్యుత్తు శాఖ అధికారుల‌ను బెదిరించిన ఘ‌ట‌న‌లో రెహ్మాన్‌ తండ్రి మామ్లూక‌ర్ రెహ్మాన్ బ‌ర్క్‌ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా న‌వంబ‌ర్ 24వ తేదీన సంభ‌ల్‌లోని షాహి జామా మ‌సీదు(Shahi Jama Masjid) ఘ‌ట‌న‌లో ఎంపీ రెహ్మాన్‌పై ఇప్పటికే ఓ కేసు నమోదు చేసిన విష‌యం తెలిసిందే.

Next Story