తాలిబన్, అల్ ఖైదా వలె కేంద్రం వ్యవహరిస్తొంది: సంజయ్ రౌత్

by Disha Web Desk 17 |
తాలిబన్, అల్ ఖైదా వలె కేంద్రం వ్యవహరిస్తొంది: సంజయ్ రౌత్
X

ముంబై: కేంద్ర సంస్థలను విపక్షాలపై ఉసి గొల్పుతున్నారనే ఎనిమిది పార్టీ నేతలు ప్రధానికి రాసిన ఉమ్మడి లేఖ తర్వాత ఉద్ధవ్ థాక్రే మద్దతుదారుడు, ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రం‌పై మండిపడ్డారు. దర్యాప్తు సంస్థల ద్వారా వారిపై జరిపిన దాడులను అల్-ఖైదా తాలిబాన్ దాడులతో పోల్చారు. ప్రత్యర్థులను అంతమొందించేందుకు తాలిబన్, అల్ ఖైదా వలె ప్రభుత్వం సీబీఐ-ఈడీ ఆయుధాలుగా చేసుకుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా కేంద్ర సంస్థలతో దాడులను ఉపయోగించి భయోత్పాతానికి పాల్పడుతుందని ఆరోపించారు. ఇదంతా ప్రజాస్వామ్యం కాదని ఫాసిజాన్ని మించి ఉందని విమర్శించారు.

ప్రధాని మోడీ ఆదేశాలతో ఈ సోదాలు కొనసాగుతున్నాయని అన్నారు. అంతకుముందు ఆదివారం ఎనిమిది రాజకీయ పార్టీల నేతలు మూకుమ్మడిగా సిసోడియా అరెస్టును వ్యతిరేకిస్తూ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కేంద్రం, దర్యాప్తు సంస్థలను తప్పుగా ఉపయోగించుకోవడం మానుకోవాలని కోరారు.

Next Story

Most Viewed