మెస్సీ సెక్యురిటీ చూశారా? ప్రధాని రేంజ్‌లో!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-13 04:40:41  IST  )

ప్ర‌పంచ దిగ్గ‌జ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనార్డ్ మెస్సీ ఇండియాలో అడుగుపెట్టారు. GOAT టూర్‌లో భాగంగా 3 రోజులు ఇండియాలో ఉండ‌నున్న

మెస్సీ సెక్యురిటీ చూశారా? ప్రధాని రేంజ్‌లో!
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌పంచ దిగ్గ‌జ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనాల్ మెస్సీ ఇండియాలో అడుగుపెట్టారు. GOAT టూర్‌లో భాగంగా 3 రోజులు ఇండియాలో ఉండ‌నున్న మెస్సీ కోల్ క‌తాలోని నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. మెస్సీ రాకతో ఎయిర్ పోర్ట్ వద్ద ఫ్యాన్స్ సందడి చేశారు. మెస్సీ వస్తున్నాడని తెలిసి అభిమానులు ముందుగానే అక్కడకు చేరుకుని వెల్ కమ్ బోర్డులు పట్టుకుని గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.

ఇక మెస్సీకి భారీ భద్రతను కల్పించారు. ప్రధాని రేంజ్ లో ఆయనకు సెక్యురిటీ కల్పించి కోల్ కతాలోని ఓ హోటల్‌కు తీసుకువెళ్లారు. ఇక ఈ పర్యటనలో భాగంగా మూడు రోజులు మెస్సీ ఇండియాలోనే ఉండనున్నారు. 14ఏళ్ల తరవాత భారత్ లో పర్యటిస్తున్న మెస్సీ హైదరాబాద్ సహా కోల్ కతా, ముంబై, ఢిల్లీలో పర్యటించనున్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో మెస్సీ ఫుట్ బాల్ ఆడనున్నారు. VIDEO

Next Story