- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై న్యాయవాది కీలక ప్రకటన
గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదవశాత్తు కూలిపోవడంతో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన భారత్ తో పాటే యావత్ దేశాన్ని షాక్ కు గురిచేసింది.

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదవశాత్తు కూలిపోవడంతో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన భారత్ తో పాటే యావత్ దేశాన్ని షాక్ కు గురిచేసింది. ఈ ప్రమాదంలో విదేశీ పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘోర ప్రమాదం పై విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో విమాన ప్రమాద కేసులో ప్రధాన న్యాయవాది మైక్ ఆండ్రూస్ (Mike Andrews) కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ బృందంతో బాధితుల కుటుంబాలకు చెందిన సుమారు 130 మంది సభ్యులు సంతకం చేశారని, వారి తరపున తాము దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.
ప్రతి కుటుంబం కోల్పోయిన ప్రత్యేక అంశాలను తాము పరిశీలిస్తున్నామని, ప్రమాదం వల్ల కుటుంబాల జీవిత గమనం మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము చట్టపరమైన సిద్ధాంతాల పరంగా చాలా పరిశోధనలు చేసినప్పటికీ, ప్రస్తుతం సంఘటనకు దారితీసిన సాంకేతిక అంశాలు, ఇక్కడ ఏమి జరిగిందనే దానిపైనే దృష్టి సారించామని ఆండ్రూస్ వివరించారు. ఈ ప్రమాదానికి కారణమైన అంతర్లీన సమస్యను అర్థం చేసుకోవడం ముఖ్యమని తాము ఎల్లప్పుడూ చెబుతున్నామని ఆయన అన్నారు.
ప్రమాదానికి ముందు విద్యుత్ వ్యవస్థలో సమస్య?
ప్రమాదానికి సంబంధించిన సాక్ష్యాలను అర్థం చేసుకోవడానికి తాము నిపుణులతో కలిసి పనిచేసినట్లు మైక్ ఆండ్రూస్ వెల్లడించారు. ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందు లైట్లు ఆగి, మళ్లీ వెలిగి, ఆపై ఆకుపచ్చగా మారాయని ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. తమ విశ్లేషణ ప్రకారం, ఇది ప్రాథమిక విద్యుత్ బస్ నుండి ద్వితీయ లేదా అత్యవసర లైట్లకు మారుతున్నట్లు సూచిస్తుందని తెలిపారు. విమానంలో విద్యుత్ వ్యవస్థలో లోపం ఉందని నిపుణులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఈ విమానాలలో సంభవించిన 'వాటర్ లీక్ల'ను కూడా తాము గుర్తించగలిగామని, ఆ లీక్లు విద్యుత్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయో దర్యాప్తు చేస్తున్నామని ఆండ్రూస్ చెప్పారు. ఏఏఐబీ (AAIB), ఇతర పరిశోధకులు ఈ వారం వాషింగ్టన్కు వెళ్లి నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డును కలవనున్నట్లు సమాచారం. వారి పర్యటనకు గల కారణాలు, వారికి అవసరమైన సమాచారంపై తాము ఆసక్తిగా ఉన్నామని విమాన ప్రమాద కేసులో ప్రధాన న్యాయవాది మైక్ ఆండ్రూస్ తెలిపారు.






