బీజేపీ పాలిత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణం: RSP

by Disha Web Desk 12 |
బీజేపీ పాలిత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణం: RSP
X

దిశ, డైనమిక్ బ్యూరో : బీజేపీ పాలనపై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ హత్యపై ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీజేపీ పరిపాలిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మాజీ ఎంపీ అతీక్ అహ్మద్‌ను ‘పోలీసుల సాక్షిగా’ పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపిన వీడియో చూస్తే అర్థమవుతుందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు వీటిని గమనించాలి. బీజేపీ పట్ల జాగ్రత్తగా ఉండాలి అని ప్రవీణ్ కుమార్ సూచించారు.



Next Story

Most Viewed