- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కోర్టుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆయనను కోర్టుకు తీసుకువెళ్తుండగా ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా?అని అక్కడ ఉన్న ఓ మీడియా ప్రతినిధి అడుగగా అందుకు కేజ్రీవాల్ రియాక్ట్ అయ్యారు. 'నా జీవితం దేశానికి సమర్పితం. నేను లోపల ఉన్న బయట ఉన్న దేశం కోసం పని చేస్తుంటా' అని చెప్పుకుంటూ కోర్టు లోపలికి వెళ్లిపోయారు. ఇక రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ను ప్రవేశపెట్టిన ఈడీ.. లిక్కర్ కుంభకోణం కోసులో కీలక సూత్రధారి కేజ్రీవాల్ అని ఆరోపించింది. ఈ కేసులో మరింత విచారించేందుకు ఆయనను 10 రోజుల పాటు రిమాండ్ కు ఇవ్వాలని కోర్టును కోరింది. మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్ పై ఆప్ నేతలు మండిపడుతున్నారు. కేజ్రీవాల్ అంటే ఓ వ్యక్తి కాదని ఓ సిద్ధాంతం అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. ఆప్ శ్రేణులంతా ఆయన వెంట ఉన్నాయని చెప్పారు.