- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదల ఇళ్లు కూల్చే మీ నుంచి మేము నేర్చుకోవాలా?: రేవంత్కు కేరళం సీఎం స్ట్రాంగ్ కౌంటర్
కేరళంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది.

దిశ, వెబ్డెస్క్: కేరళంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఈ క్రమంలో యూడీఎఫ్ (UDF) తరపున ప్రచారం చేయడానికి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం పినరయి విజయన్పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. వీటికి పినరయి విజయన్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా సమాధానమిచ్చారు. కేరళలో పర్యటించిన రేవంత్ రెడ్డి, అక్కడ ప్రధాని మోడీ, సీఎం విజయన్లను "మోడీ బ్రదర్స్" అని సంబోధిస్తూ విమర్శలు గుప్పించారు. కేరళంలో అవినీతి, అడ్మినిస్ట్రేటివ్ వైఫల్యాలు ఉన్నాయని, పినరయి విజయన్ పాలన ‘చీకటి యుగం’ అని ఆయన ఆరోపించారు.
పినరయి విజయన్ ఘాటు కౌంటర్..
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను "సమాచారం లేని విమర్శలు"గా విజయన్ కొట్టిపారేశారు. తెలంగాణలో పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపిస్తున్న విషయాన్ని మరిచిపోయి, కేరళం అభివృద్ధి గురించి పాఠాలు చెప్పడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఆయన్ని ఎవరో తప్పుదోవ పట్టించారు," అని విజయన్ ఎద్దేవా చేశారు. నీతి ఆయోగ్ సుస్థిర అభివృద్ధి సూచీ (2023–24) ప్రకారం, కేరళం దేశంలోనే అత్యంత తక్కువ అవినీతి గల రాష్ట్రంగా అగ్రస్థానంలో ఉందని, తెలంగాణ 6వ స్థానంలో ఉందని ఆయన గుర్తుచేశారు. కేరళంలో పేదరికం రేటు కేవలం 0.55% మాత్రమేనని, ఇది దేశంలోనే అత్యల్పమని పేర్కొన్నారు. అలాగే, అక్షరాస్యత, శిశు మరణాల రేటు (IMR) తగ్గించడంలో కేరళం ఎంతో ముందుందని, తెలంగాణ కంటే మెరుగైన స్థితిలో ఉందని గణాంకాలను వివరించారు. జీతాలు, పెన్షన్లు సక్రమంగా చెల్లించలేని ప్రభుత్వం నడుపుతున్న వ్యక్తి నుండి కేరళం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. కేరళం నుండి పాలన పాఠాలు నేర్చుకోవాల్సింది రేవంత్ రెడ్డే," అని విజయన్ చురకలంటించారు.






