- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
CAA ను మా రాష్ట్రంలో అమలు చేయం: ముఖ్యమంత్రి
దిశ, వెబ్డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం-2019(CAA)ను అమలులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను సోమవారం విడుదల చేసింది. లోక్సభ ఎన్నికలకు ముందే చట్టాన్ని అమలులోకి తీసుకొస్తామని చెప్పిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు నిజమయ్యాయి.
అయితే, ఈ చట్టం ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు దేశ పౌరసత్వాన్ని కేంద్రం ఇవ్వబోతోంది. ఇదిలా ఉండగా.. ఈ చట్టంలో ముస్లింలకు మినహాయింపు ఇవ్వడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా.. ఈ చట్టంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. CAA చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోము అని తేల్చి చెప్పారు. దీనిని మత విభజన చట్టంగా అభివర్ణించిన విజయన్.. ఎట్టి పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో అమలు కాదని కేంద్రానికి తెగేసి చెప్పారు.