ఈడీ నోటీసుల పై కేజ్రీవాల్ ఫైర్.. విచారణకు గైర్హాజరు

by Mahesh |
ఈడీ నోటీసుల పై కేజ్రీవాల్ ఫైర్.. విచారణకు గైర్హాజరు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో కేసలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చింది. దీంతో ఆయన ఈ రోజు ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో హాజరుకానున్నారు. అయితే సీఎం కేజ్రీవాల్ ఈడీ ముందు హాజరవుతారా లేదా అనే దానిపై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మౌనంగా ఉంది. ఈడీ తనకు ఇచ్చిన నోటీసులపై కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఈడీకి ఆయన లేక రాశారు. “సమన్ నోటీసు చట్టవిరుద్ధం మరియు రాజకీయ ప్రేరేపితమైనది. బీజేపీ సూచన మేరకు నోటీసులు పంపారు. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లలేనంటూ నోటీసులు పంపారు.

ఈడీ వెంటనే నోటీసును ఉపసంహరించుకోవాలని తెలిపారు. అయితే కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేయవచ్చని ఢిల్లీ మంత్రి అతీషి అభిప్రాయపడ్డాడు. ఆయనను ED ప్రశ్నించిన తర్వాత కస్టడీలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుందని సమాచారం. అయితే ఈ రోజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరుకావడం లేదు. ఎందుకంటో ఈరోజు ఆయన మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు.

Next Story

Most Viewed