Karnataka: ప్రధాని మోడీ అనుమతిస్తే భారత ఆత్మాహుతి బాంబర్ అవుతానన్న కర్ణాటక మంత్రి

by S Gopi |   ( Updated:2025-05-09 12:54:19.0  )
Karnataka: ప్రధాని మోడీ అనుమతిస్తే భారత ఆత్మాహుతి బాంబర్ అవుతానన్న కర్ణాటక మంత్రి
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ముదురుతున్న నేపథ్యంలో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత, మైనారిటీ సంక్షేమ మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం తనను తాను త్యాగం చేసుకునేందుకు సిద్ధమన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన మంత్రి జమీర్.. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ అనుమతిస్తే తాను పాకిస్తాన్‌పై ఆత్మాహుతి దాడికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. గతంలోనూ ఓ మీడియా సంభాషణలో జమీర్ ఇవే వ్యాఖ్యలు చేశారు. యుద్ధం వస్తే, అన్నిటికీ తాను సిద్ధం. ఒక రాష్ట్ర మంత్రిగా పాకిస్తాన్‌పై యుద్ధానికి ముందుంటాను. భారత్ కోసం యుద్ధంలో పాల్గొనేందుకు తానే వెళ్తానని, అవసరమైతే ఆత్మాహుతి బాంబును ధరిస్తాను. తానేని సరదాగా చెప్పట్లేదు, దేశం కోసం ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనకు ఆత్మాహుతి బాంబు ఇస్తే పాకిస్తాన్‌కు వెళ్తానని అన్నారు. ఇదే సమయంలో బీజేపీపై జమీర్ అహ్మద్ ఖాన్ విమర్శలు గుప్పించారు. బీజేపీ నిరంతరం ముస్లింలను టార్గెట్ చేస్తుంది. ముస్లింలు ఇంకా ఏం చేయాలి. భారతీయ ముస్లింలుగా ఇప్పటికీ నిరూపించుకోవాలా? అంటూ ప్రశ్నించారు. తమకు పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధం లేదు. వాస్తవానికి పాకిస్తాన్‌ను తాము ధ్వేసిస్తున్నామని విలేకరులతో చెప్పారు.



Next Story