బాలిక తల నరికి తీసుకెళ్లిన వరుడికి ఏమైందంటే ?

by Dishanational4 |
బాలిక తల నరికి తీసుకెళ్లిన వరుడికి ఏమైందంటే ?
X

దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని సూర్లబ్బి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ప్రకాశ్ అనే 32 ఏళ్ల యువకుడు.. 16 ఏళ్ల బాలికను దారుణంగా నరికి చంపి, ఆమె తలను పట్టుకుని పరారయ్యాడు. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా.. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం కొడగు జిల్లా హమ్మియాల గ్రామంలో ప్రకాశ్ డెడ్‌బాడీ లభించింది. బాలికను హత్య చేశాక.. ప్రకాశ్ సూసైడ్ చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

అసలేం జరిగింది ?

కొన్నాళ్ల క్రితమే ప్రకాశ్‌కు మీనాతో పెళ్లి నిశ్చయమైంది. వీరిద్దరి నిశ్చితార్థం గురువారం ఉదయమే జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులెవరో మీనా మైనర్ అంటూ చైల్డ్ హెల్ప్​లైన్​కు సమాచారం అందించారు. దీంతో చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్ అధికారులు మీనా ఇంటికి వచ్చి.. ఆమెకు ఈ ఏజ్‌లో పెళ్లి చేయొద్దని పేరెంట్స్‌కు వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. దీనిపై ప్రకాశ్, మీనా కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. దీంతో మీనాకు 18 ఏళ్లు నిండాక ప్రకాశ్​తో పెళ్లి చేయాలని రెండు ఫ్యామిలీలు డిసైడయ్యాయి. ఇది జరిగిన కొన్ని గంటలకే (గురువారం సాయంత్రం 5.30కి) మీనా ఇంటికి ప్రకాశ్ వెళ్లాడు. మీనా తండ్రిని కొట్టాడు. ఆమె తల్లిపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఆ తర్వాత మీనాను దాదాపు 100 మీటర్ల మేర బయటికి ఈడ్చుకెళ్లి ఆమె తలను నరికాడు. మొండెంను అక్కడే వదిలేసి తలను తీసుకొని ప్రకాశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం ప్రకాశ్ కూడా విగతజీవిగా పోలీసులకు దొరికాడు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed