విద్యార్థులకు షాకింగ్ న్యూస్.. విద్యార్థుల స్కాలర్‌షిప్ మొత్తాన్ని తగ్గించిన కర్ణాటక ప్రభుత్వం

by Disha Web Desk 12 |
విద్యార్థులకు షాకింగ్ న్యూస్.. విద్యార్థుల స్కాలర్‌షిప్ మొత్తాన్ని తగ్గించిన కర్ణాటక ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు షాక్ ఇచ్చింది. ఇన్ని రోజులు పేద విద్యార్థులు చదువుకొవడానికి ఇస్తున్న స్కాలర్‌షిప్‌లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పెద విద్యార్థులతో పాటు.. వారి తల్లిదండ్రులు, కర్ణాటక ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని నిర్మాణ కార్మికుల పిల్లల స్కాలర్‌షిప్ మొత్తాన్ని తగ్గించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వ కార్మిక శాఖ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ మంత్రి స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం ఈ పరిస్థితికి నగదు కొరతే కారణమని చెప్పింది. అలాగే ఈ నగదు కొరత కు బీజేపీ పాలనే కారణం అని రివర్స్ అటాక్ చేసింది. కాగా కర్ణాటక ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్యా కోర్సుల వరకు స్కాలర్‌షిప్ మొత్తాన్ని 80-85 శాతం తగ్గించింది.



Next Story

Most Viewed