కర్ణాటకలో నామినేషన్ల పర్వం.. సీఎం బొమ్మై నామినేషన్ దాఖలు

by Disha Web Desk 13 |
కర్ణాటకలో నామినేషన్ల పర్వం.. సీఎం బొమ్మై నామినేషన్ దాఖలు
X

బెంగళూరు: కర్ణాటకలో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. శనివారం సీఎం బసవరాజ్ బొమ్మై షిగ్గాన్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. దీనికి ముందు ఆయన హుబ్లీలోని సిద్ధరుధ మఠ్‌ను సందర్శించి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాగా, బీజేపీ ఇప్పటికే రెండు విడుతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

రెండో జాబితాలో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నిరాశే ఎదరైంది. ఇప్పటివరకు ప్రకటించిన జాబితాల్లో 212 మందికి చోటు కల్పించింది. మరో 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా, టికెట్ ఆశించిన నిరాశకు గురైన కొందరు నేతలు పార్టీని వీడారు.

Next Story

Most Viewed