కర్ణాటక జీఎస్టీ వసూళ్లు రూ.6,085 కోట్లు

by Dishanational2 |
కర్ణాటక జీఎస్టీ వసూళ్లు రూ.6,085 కోట్లు
X

బెంగళూరు: కర్ణాటకలో గత నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు వచ్చినట్లు సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, నిఘా, పన్ను చెల్లింపుదారుల అప్రమత్తతతో ఇది సాధ్యమైందని చెప్పారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శనివారం ఆయన ట్వీట్ చేశారు. 'కర్ణాటక జీఎస్టీ పన్నుల వసూళ్లలో అత్యధిక వృద్ధి రేటు ఉన్న రాష్ట్రంగా (30శాతం) కొనసాగుతుంది. గత నెలలో రికార్డు స్థాయిలో రూ.6,085 కోట్లు జీఎస్టీ వసూళ్లు వచ్చాయి' అని పేర్కొన్నారు. ఈ తరహా దూకుడు ప్రభుత్వం మరింత మెరుగైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు దోహదపడుతుందని తెలిపారు.

Next Story

Most Viewed