కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. కుక్కకాటుతో మరణిస్తే రూ.5లక్షల పరిహారం

by Ajay Maddhiboyina |

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుక్క కాటుతో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీంతో కుక్కకాటుతో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందనుంది.

కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. కుక్కకాటుతో మరణిస్తే రూ.5లక్షల పరిహారం
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుక్క కాటుతో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీంతో కుక్కకాటుతో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందనుంది. అంతే కాకుండా కుక్కకాటు వల్ల గాయపడినవారికి సైతం రూ.5వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. రూ.5వేలలో రూ.3500 నేరుగా బాధితుడికి ఇస్తే మరో రూ.1500 సువర్ణ ఆరోగ్య సురక్ష ట్రస్ట్‌కు వెళుతుంది. ఇదిలా ఉంటే త‌మిళ‌నాడులో కుక్కకాటు మరణాల సంఖ్య ఆందోళనకరంగా మారింది. బెంగుళూరులో వీధి కుక్క‌ల దాడులు పెరిగిపోయాయి. ఈ నేప‌థ్యంలోనే బాధితుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. అదే విధంగా వీధి క‌క్కల‌ను నియంత్రించేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యించింది.

Next Story