- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఈ సారి గెలుపు నాదే.. ఆ మూడు లోక్ సభ స్థానాలపై కమల్ హాసన్ ఫోకస్..!
దిశ,డైనమిక్ బ్యూరో: మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ రాబోయే లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించారు. రాబోయే ఎన్నికల్లో తాను తప్పక గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాజాగా పార్టీ నాయకులతో సమావేశమైన ఆయన కోయంబత్తూర్, మధురై, దక్షిణ చెన్నై ఈ స్థానాల్లో ఎంఎన్ఎం పార్టీ పోటీ చేయబోతున్నదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలు ఎలా ఉన్నా ఈసారి గెలుపు మనదే అని పార్టీ నేతలకు చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు గెలుపు కోసం పార్టీ తీసుకోబోయే రాజకీయ చర్యల గురించి కమల్ హాసన్ తన పార్టీ జిల్లా స్థాయి కార్యకర్తలకు వివరించినట్లు పార్టీ వర్గాలు తెలిపారు.
ఈ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యతిరేక పార్టీలతో పొత్తు దిశగా పార్టీ ప్రణాళిక రచిస్తోంది. ఈ మేరకు పార్టీ పోటీచేయాలని నిర్ణయించిన స్థానాల్లో బూత్ లెవల్లో పార్టీని పటిష్టం చేసేందుకు కార్యాచరణ తీసుకోబోతున్నట్లు తెలిపారు. త్వరలోనే బైక్ ర్యాలీలను సైతం చేపట్టే యోచనలో ఉన్నట్లు తెలిపారు. కాగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కమల్ హాసన్ మద్దతు ప్రకటించారు. స్వయంగా రాహుల్తో కలిసి నడిచారు. దీంతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమితో ఎంఎన్ఎం పార్టీ పొత్తు దాదాపు ఖాయం అనే టాక్ వినిపిస్తున్నది.