అహ్మదాబాద్ విమాన ప్రమాదం వెనుక కుట్రకోణం - KA పాల్

by velandi.Saikiran |

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం పై KA పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని బాంబు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం వెనుక కుట్రకోణం - KA పాల్
X

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం పై KA పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని బాంబు పేల్చారు. 242 మంది ప్రయాణికులు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంపై (Air India Plane Crash).. పాకిస్తాన్ ఉగ్రవాదులు కుట్ర ( Pakistani terrorists) చేశారని.. ఈ సంఘటనపై వెంటనే విచారణ చేయాలని డిమాండ్ చేశారు కేఏ పాల్ ( Ka Paul). ఇలాంటి సంఘటన జరగడం చాలా దారుణమని... మరణించిన వారికి సంతాపం కూడా తెలిపారు. విమాన ప్రమాద సంఘటన... బ్లాక్ డే అంటూ ఎమోషనల్ అయ్యారు కే ఏ పాల్.

ఇది ఇలా ఉండగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో.. అందులో ప్రయాణించిన 242 మంది మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే విమానంలో ప్రయాణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ రూపానీ (Former Gujarat CM Vijay Rupani ) కూడా మృతి చెందినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం ఇచ్చారని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. విమానంలో ప్రయాణించిన ఒక్కరు కూడా బతికే ఛాన్స్ లేదని సిపి జ్ఞానేంద్ర సింగ్ ( CP Gyanendra Singh) కూడా వెల్లడించారట. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story