జ్యోతి ఇంస్టాగ్రామ్ లో షాకింగ్ నిజాలు.. జనవరిలోనే పహల్గాం ప్లాన్ ?

by velandi.Saikiran |   (  Updated:2025-05-17 20:00:21  IST  )

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయిన నేపథ్యంలో... పహాల్గం ఘటనపై మోడీ ప్రభుత్వం దృష్టి పెట్టింది.

జ్యోతి ఇంస్టాగ్రామ్ లో షాకింగ్ నిజాలు.. జనవరిలోనే పహల్గాం ప్లాన్ ?
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయిన నేపథ్యంలో... పహాల్గం ఘటనపై మోడీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ కు సపోర్ట్ చేసి, భారత సమాచారాన్ని అందజేసిన వారి చిట్టా విప్పుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియా స్టార్ జ్యోతి మల్హోత్రాను హర్యానాలో అరెస్టు చేశారు.

పాకిస్తాన్ కు జ్యోతి మల్హోత్రా సమాచారం పంపినట్లు పక్కా ఆధారాలు దొరకడంతో అరెస్టు చేశారు. అయితే తాజాగా ఈ సంఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ కు సహాయం చేసిన జ్యోతి మల్హోత్రా ఇంస్టాగ్రామ్ లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. జనవరిలోనే పహల్గాం ప్రాంతాన్ని సందర్శించి.. అక్కడి విషయాలను పాకిస్తాన్ ఉగ్రవాదులకు చేరవేర్చింది జ్యోతి.

ఇక ఇండియా సమాచారాన్ని మొత్తం పాకిస్తాన్ ఇంటలిజెన్స్ అధికారులకు అందజేసిందని గుర్తించారు. ధనిష్ అనే పాకిస్తాన్ అధికారికి జ్యోతి పూర్తి సమాచారం అందించినట్లు అధికారులు తాజాగా విచారణలో కీలక సమాచారం రాబట్టారు. ఈ తరుణంలోనే జ్యోతి జనవరిలో దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి.


Next Story