ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ ‘మట్టూ’ అరెస్ట్.. ఎవరతడు ?

by Dishanational4 |
ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ ‘మట్టూ’ అరెస్ట్.. ఎవరతడు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది జావెద్ అహ్మద్‌ మట్టూను కేంద్ర దర్యాప్తు సంస్థల సాయంతో ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ టీమ్ అరెస్టు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడిన మట్టూ అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నేపాల్‌కు పారిపోయాడు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సేకరించేందుకు జావెద్ అహ్మద్‌ మట్టూ మళ్లీ ఢిల్లీకి వస్తున్నాడని కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా విభాగాలు అలర్ట్ అయ్యాయి.

టాప్-10 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో..

నగరంలోకి ప్రవేశించిన తర్వాత అతడి కదలికలను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ టీమ్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసింది. చివరకు ఓ చోట రౌండప్ చేసి పట్టుకుంది. మట్టూ నుంచి ఒక పిస్టల్, ఆరు లైవ్ కాట్రిడ్జ్‌లు, దొంగిలించబడిన కారును స్వాధీనం చేసుకుంది.జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడులు చేస్తున్న టాప్-10 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఇతడు ఒకరు. ఇతడి తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. కశ్మీర్ సరిహద్దు మీదుగా పాకిస్తాన్ ఐఎస్ఐ హ్యాండ్లర్ల నుంచి ఆయుధాలు, డబ్బును మట్టూ సేకరించేవాడనే అభియోగాలు ఉన్నాయి.

Next Story

Most Viewed