'అన్నింట్లో పురాతన మతం ఇస్లాం'

by Dishanational2 |
అన్నింట్లో పురాతన మతం ఇస్లాం
X

న్యూఢిల్లీ: జమియత్ ఉలామా ఐ హింద్ చీఫ్ మహ్మద్ మదానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం మతం అన్ని మతాల్లోకెల్లా పురాతనమైన మతమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌కి ఎంత చెందిందో తనలాంటి వారికి అంతే చెందినదని అన్నారు. తాజాగా నిర్వహించిన సంస్థ సాధారణ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ముస్లింలకు భారత్ స్వస్థలమని చెప్పారు. ఇస్లాం మతస్థులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారనేది పూర్తి ఆధారరహితమని తెలిపారు. దేశంలో విద్వేష ప్రసంగాలతో ఇస్లోమోఫోబియా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ పరిణామాల గురించి ప్రభుత్వానికి తెలిసినప్పటికీ.. నిరోధించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదని విమర్శించారు. అయితే దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి సానుకూలంగా వ్యవహరించాలని అన్నారు.

Next Story