తమిళనాడులో జల్లికట్టు ఆట షురూ

by Dishanational2 |
తమిళనాడులో జల్లికట్టు ఆట షురూ
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులో ప్రతి ఏటా జరిగే మొదటి జల్లికట్టు పుదుకోట్టై జిల్లాలోని తచ్చంగురిచి గ్రామంలో శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తచ్చింగురిచి విన్నెల్పు అన్నై ఆలయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే ఈ జల్లికట్టు ఆటను రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి, పర్యావరణ శాఖ మంత్రి మెయ్య నాథన్‌, కలెక్టర్ ఐఎస్ మెర్సీలు ప్రారంభించారు. క్రీడాకారులు ప్రమాణం చేసిన అనంతరం మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. దీనిలో సుమారు 500మంది ఎద్దులు పాల్గొన్నాయి. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వందలాది మంది ప్రేక్షకులు హాజరయ్యారు. జల్లికట్టును పర్యవేక్షించేందుకు పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జల్లికట్టులో పాల్గొనే ఎద్దులను పరిశీలించేందుకు పశుసంవర్థక శాఖ జోనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌(పీఓ) రామచంద్రన్‌ ఆధ్వర్యంలో వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. జల్లికట్టు ముగియగానే ఎద్దులను అక్కడక్కడ వదులు కోవద్దని నిర్వాహకులకు అధికారులు సూచించారు. అలాగే ఎద్దుల కొమ్ములు పదునుగా ఉంటే వాటిని ప్లాస్టిక్ టోపీతో కప్పాలని తెలిపారు. కాగా, జల్లికట్టు అనేది పొంగల్ వేడుకల్లో భాగంగా రాష్ట్రంలో జరుపుకునే పురాతన క్రీడ. ఇటీవల ఇది పలు వివాదాలకు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీలంకలోనూ ఈ ఏడాది జల్లికట్టు పోటీలు ప్రారంభించారు. ట్రింకోమలోలీలోని సాంపూర్‌లో నిర్వహిస్తున్న ఈ ఆటలో 200 ఎద్దులు పాల్గొన్నాయి.

Next Story

Most Viewed