ఇరాన్‌పై యుద్ధానికి కలిసి రండి: ప్రపంచ దేశాలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పిలుపు!

by Gantepaka Srikanth |

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి.

ఇరాన్‌పై యుద్ధానికి కలిసి రండి: ప్రపంచ దేశాలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పిలుపు!
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్ తీరుపై ఆగ్రహంగా ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు ప్రపంచ దేశాధినేతలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఇరాన్ అరాచకాలను అరికట్టేందుకు, ప్రపంచ శాంతిని కాపాడేందుకు అమెరికా-ఇజ్రాయెల్ కూటమితో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇరాన్ తన మిత్రపక్షాల ద్వారా పశ్చిమాసియాలో అస్థిరతను సృష్టిస్తోందని నెతన్యాహు ఆరోపించారు. "ఇది కేవలం ఇజ్రాయెల్ యుద్ధం మాత్రమే కాదు.. ఇది నాగరికతకు మరియు బార్బరిజానికి (అనాగరికత) మధ్య జరుగుతున్న పోరాటం. స్వేచ్ఛను ప్రేమించే ప్రతి దేశం ఈ యుద్ధంలో మాతో చేరాలి" అని ఆయన పేర్కొన్నారు.

బాధ్యత అందరిపైనా ఉంది..

ఇరాన్ అణు సామర్థ్యాన్ని, ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవడంలో అమెరికా ఇప్పటికే తమకు అండగా ఉందని, మిగిలిన ప్రపంచ దేశాలు కూడా అదే బాటలో పయనించాలని ఆయన కోరారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ ఘర్షణలు ప్రస్తుతం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య నేరుగా దాడులకు దారితీశాయి. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను ఇజ్రాయెల్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. మరోవైపు ఇజ్రాయెల్ జరిపిన ప్రతీకార దాడుల్లో ఇరాన్ కీలక సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో, ఇరాన్ తన పట్టును కోల్పోకుండా ఉండటానికి 'హోర్ముజ్ జలసంధి'ని దిగ్బంధించి ప్రపంచ ఇంధన సరఫరాను అడ్డుకుంటోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాకముందే ఇరాన్‌ను నియంత్రించాల్సిన బాధ్యత అందరిపై ఉందని నెతన్యాహు హెచ్చరించారు.

Next Story