శాంతి ఒప్పందం దిశగా ఇజ్రాయెల్, లెబనాన్ చారిత్రాత్మక తొలి అడుగు

by Malleboina Mahesh |

శాంతి దిశగా ఇజ్రాయెల్-లెబనాన్ చారిత్రాత్మక ఒప్పందం.. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సమక్షంలో వాషింగ్టన్‌లో రాయబారుల సంతకాలు!

శాంతి ఒప్పందం దిశగా ఇజ్రాయెల్, లెబనాన్ చారిత్రాత్మక తొలి అడుగు
X

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్ సైన్యానికి, ఇరాన్ మద్దతు గల హెజ్బుల్లా సాయుధ దళాలకు మధ్య జరుగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఒక చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు శాంతి స్థాపనే లక్ష్యంగా తొలిసారిగా ఒక ముక్కోణపు ‘ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం’ (Framework Agreement) పై అధికారికంగా సంతకాలు చేశాయి. అమెరికా పర్యవేక్షణలో, వాషింగ్టన్‌లోని యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో శుక్రవారం (జూన్ 26) రాత్రి ఈ మైలురాయి లాంటి ఒప్పంద ప్రక్రియ పూర్తయింది.

అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ఆధ్వర్యంలో..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన యంత్రాంగం ఐదు విడతలుగా జరిపిన సుదీర్ఘ చర్చల ఫలితంగా ఈ ఒప్పందం కుదిరినట్టు తెలుస్తుంది. యుఎస్ విదేశాంగ మంత్రి (Secretary of State) మార్కో రూబియో సమక్షంలో.. అమెరికాలో ఇజ్రాయెల్ రాయబారి యెహీయెల్ లైటర్, లెబనాన్ రాయబారి నాద హమదే తమ తమ దేశాల తరపున ఈ చారిత్రాత్మక పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మార్కో రూబియో మాట్లాడుతూ.. ఇది శాంతి మార్గంలో "ప్రారంభానికి ఆరంభం" (The beginning of the beginning) మాత్రమేనని, ముందు ఇంకా చాలా కష్టమైన పని ఉందని వ్యాఖ్యానించారు.

Next Story