భారత్‌లో చొరబాట్లకు డ్రోన్లతో సాయం.. పాకిస్తాన్ ఐఎస్ఐ కొత్త ప్లాన్!

by Phanindra |

భారత్‌లో చొరబాట్లకు డ్రోన్లతో సాయం చేయాలని పాకిస్తాన్ ఐఎస్ఐ కొత్త ప్లాన్ వేసింది. ఈ విషయాన్ని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో కనిపెట్టింది.

భారత్‌లో చొరబాట్లకు డ్రోన్లతో సాయం.. పాకిస్తాన్ ఐఎస్ఐ కొత్త ప్లాన్!
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లో చొరబాట్ల కోసం డ్రోన్ టెక్నాలజీని కూడా పాకిస్తాన్ వాడుకుంటోంది. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో కనుగొని కేంద్ర హోంశాఖకు తెలియజేసింది. ముందుగా సరిహద్దు వెంబడి డ్రోన్లతో సర్వైలెన్స్ నిర్వహించి, భారత సెక్యూరిటీలో బలహీనతలను గుర్తించాలని, వాటిని ఉపయోగించుకొని భారత్‌లోకి చొరబాటు దార్లను పంపించాలని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ వ్యూహం రచించినట్లు సమాచారం. ‘మే 14న ఐఎస్ఐ, లష్కర్-ఎ-తైబా కమాండర్లు, పీవోకేలోని గైడ్ల మధ్య సమావేశం జరిగింది. లష్కర్‌లో రిక్రూట్‌మెంట్లు పెంచాలని, అలాగే ఎల్‌వోసీ వెంబడి డ్రోన్లతో నిఘా పెంచాలని ఈ మీటింగ్‌లో నిర్ణయించారు’ అని ఐబీ పేర్కొన్నట్లు సమాచారం.

Next Story