50సార్లు తలపై సుత్తెతో బాది.. అమెరికాలో భారత విద్యార్థి హత్య

by Dishanational4 |
50సార్లు తలపై సుత్తెతో బాది.. అమెరికాలో భారత విద్యార్థి హత్య
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాలో మరో భారత విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఓ దుండగుడు సుత్తెతో ఇండియన్ స్టూడెంట్ వివేక్ సైనీ తలపై దాదాపు 50 సార్లు పాశవికంగా దాడి చేసి హతమార్చాడు. భారతీయ విద్యార్థి ప్రాణాలు పోయే వరకు దుండగుడు అక్కడే కూర్చున్నాడు. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని బర్వాలాకు చెందిన 25 ఏళ్ల వివేక్ సైనీ ఎంబీఏ చేసేందుకు అమెరికాలోని జార్జియాకు వెళ్లాడు. ఓ వైపు చదువుకుంటూనే.. మరోవైపు జార్జియాలోని లిథోనియా ప్రాంతంలో ఉన్న దుకాణంలో గుమస్తాగా వివేక్ సైనీ పార్ట్ టైం జాబ్ చేసేవాడు. ప్రస్తుతం లిథోనియా ప్రాంతంలో తీవ్రమైన చలి ఉంది. దీంతో ఇళ్లు లేని ఓ నిరుపేద స్థానిక వ్యక్తి వచ్చి స్టోర్‌లో ఆశ్రయం పొందాడు. స్టోర్ నిర్వాహకులు మానవతా కోణంలో ఆ నిరుపేద వ్యక్తి తలదాచుకోవడానికి చోటు ఇచ్చారు. అయితే జనవరి 16న ఆ వ్యక్తితో వివేక్ సైనీ మాట్లాడుతూ.. ‘‘ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. లేదంటే పోలీసులకు చెబుతాను’’ అని హెచ్చరించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి తన వద్ద ఉన్న సుత్తెతో వివేక్ సైనీ తలపై దాదాపు 50 సార్లు బాదాడు. దీంతో అక్కడికక్కడే వివేక్ ప్రాణాలు వదిలాడు. అనంతరం సదరు దుండగుడు.. వివేక్ డెడ్ బాడీ వద్దే కూర్చుండిపోయాడు. ఇదంతా దుకాణంలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే వివేక్ డెడ్ బాడీ భారత్‌కు చేరుకుంది. వెంటనే అంత్యక్రియలు కూడా నిర్వహించారు.



Next Story

Most Viewed