స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో క్రీడాకారులు

by Dishanational4 |
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో క్రీడాకారులు
X

న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాల పేరిట వజ్రోత్సవాలు నిర్వహించారు. ఈ క్రమంలో భారత క్రీడాకారులు ట్విట్టర్ వేదికగా తమ అభిమానులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ షట్లర్ పీవీ సింధు, బాక్సర్ నిఖత్ జరీన్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే భారత్‌తో ప్రత్యేక అనుబంధం కలిగిన డేవిడ్ వార్నర్ తన అభిమానులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు.

ఆరు నెలల్లో ఒమిక్రాన్‌కు వ్యాక్సిన్: అదర్ పునావాలా

Next Story

Most Viewed