- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Indian Railways: రైల్వేలో కొలువుల జాతర.. బిగ్ నోటిఫికేషన్ విడుదల
ఇండియన్ రైల్వేస్లో ఖాళీగా ఉన్న సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది.

దిశ, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఇండియన్ రైల్వేస్ తీపికబురు చెప్పింది. వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (Graduation) పూర్తి చేసి ఉండాలి. అలాగే అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. సెక్షన్ కంట్రోలర్ అనేది రైళ్ల రాకపోకలను పర్యవేక్షించే కీలకమైన విభాగం కావడంతో అభ్యర్థుల కంటి చూపుకు సంబంధించి రైల్వే శాఖ కఠిన నిబంధనలను విధించింది. దరఖాస్తుదారులు కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, మయోపిక్ విజన్ పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
అభ్యర్థుల ఎంపిక ఇలా..
ఈ ఉద్యోగాలకు గాను అభ్యర్థులను మొత్తం నాలుగు దశల్లో ఎంపిక చేయనున్నారు. మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఆ తర్వాత కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ పరీక్ష (CBAT)లను నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆపై మెడికల్ టెస్టులు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఈ మేరకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 14 చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు రైల్వే శాఖ అధికారిక పోర్టల్ https://www.rrbapply.gov.in/#/auth/landing లింక్ ద్వారా నేరుగా లాగిన్ అయి అప్లై చేసుకోవచ్చని రైల్వే రిక్రూట్మెంట్ అధికారులు వెల్లడించారు.






