భారత్‌కు మోస్ట్ వాంటెడ్ బబ్బర్ ఖల్సా ఉగ్రవాది!

by Phanindra |

మోస్ట్ వాంటెడ్ బబ్బర్ ఖల్సా ఉగ్రవాదిని అరెస్టు చేసి భారత్‌కు తీసుకొస్తున్నారు. యూఏఈలో తలదాచుకున్న అతన్ని అక్కడి ప్రభుత్వం ఎక్స్‌ట్రడైట్ చేసింది.

భారత్‌కు మోస్ట్ వాంటెడ్ బబ్బర్ ఖల్సా ఉగ్రవాది!
X

దిశ, నేషనల్ బ్యూరో: మోస్ట్ వాంటెండ్ ‘బబ్బర్ ఖల్సా’ ఉగ్రవాది పర్మీందర్ సింగ్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు మార్గం సుగమం అయింది. యూఏఈలో తలదాచుకున్న ఈ ఉగ్రవాదిని భారత్‌కు ఎక్స్‌ట్రడైట్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్‌లో, ముఖ్యంగా పంజాబ్‌లో పెట్రోల్ బాంబు దాడులు సహా పర్మీందర్‌పై పలు కేసులున్నాయి. అతనికి పాక్‌తో కూడా సంబంధాలున్నట్లు అనుమానాలున్నాయి. ఈ క్రమంలోనే అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీఅవడంతో అతన్ని యూఏఈ డిపోర్ట్ చేసింది. భారత్‌లో నేరాలు చేసి ఇతర దేశాల్లో తలదాచుకోవాలనుకునే క్రిమినల్స్‌కు ఇది ఒక సందేశం వంటిదని అధికారులు చెప్పారు. భారత్‌లో నేరాలు చేసిన వారు ఏ దేశంలో ఉన్నా వదిలేది లేదని, వాళ్లకు శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు.

Next Story