- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
డిస్పూర్: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి నూతన వెర్షన్ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని బాలాసోర్ తీర ప్రాంతంలో చేసిన పరీక్ష విజయవంతమైనట్లు డీఆర్ డీవో ట్వీట్ చేసింది. నిర్దేశించిన లక్ష్యాలను క్షిపణి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయోగం విజయవంతం కావడం పట్ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. 'పెరిగిన స్వదేశీ కంటెంట్, మెరుగైన పనితీరుతో కూడిన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఈరోజు(గురువారం) చాందీపూర్ నుండి విజయవంతంగా పరీక్షించారు.
క్షిపణి బృందం, డీఆర్డీవో అధికారులకు అభినందనలు' అని ట్వీట్ చేశారు. బ్రహ్మొస్ కార్యక్రమాన్ని ఈ పరీక్ష మరింత ముందుకు తీసుకెళ్తుంది. రష్యా సహకారంతో డీఆర్డీవో అధికారులు దీనిని అభివృద్ధి చేశారు. కాగా ఈ మిసైల్ భూమి, నౌక మార్గాల్లో ప్రయోగించేలా రూపొందించారు.
Next Story






