- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ ప్రపంచానికి మార్గదర్శక కాంతిగా నిలుస్తుంది: వెంకయ్యనాయుడు
పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఈ రోజు ఓ ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.

దిశ, వెబ్డెస్క్: పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindhur) పై ఈ రోజు ఓ ప్రత్యేకమైన కార్యక్రమం (special program) ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Former Vice President Venkaiah Naidu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత సాయుధ దళాలకు, 'ఆపరేషన్ సింధూర్' విజయంలో కీలక పాత్ర పోషించిన మన గొప్ప శాస్త్రవేత్తలకు వందనం చేయడానికి అందరూ సమావేశమైనట్లు తెలిపారు. అలాగే యుద్ధంలో వారి సేవలను యువతరం, సాధారణ ప్రజలతో పంచుకోవాలి, వారు చూపిన ఆదర్శవంతమైన వీరత్వాన్ని, కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్ సింధూర్ ను విజయవంతం చేయడంపై ఖచ్చితమైన విధానాన్ని హైలైట్ చేయాలని అన్నారు.
ఇది ఒక గొప్ప విజయం.. భారతదేశం ఆధ్యాత్మిక జ్ఞానం, సాంస్కృతిక గొప్పతనానికి నిలయంగా ఉంది. భారత్ టెక్నాలజీ, జ్ఞానం ప్రపంచానికి మార్గదర్శక కాంతిగా నిలుస్తుంది. భారత్ ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమైన సహనం, ఒత్తిడికి ప్రసిద్ధి చెందింది. భారత్ ఎప్పుడూ ఏ దేశంపై దాడి చేయలేదు. మేము ఈ వలసవాద ఆలోచన, పాలన వ్యవస్థను వ్యతిరేకిస్తున్నాము. భారత్ పాకిస్తాన్ పై దాడులను కేవలం స్వీయ రక్షణ కోసం మాత్రమే చేసిందని ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు.






