ముగిసిన భారత్‌, రష్యా ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం.. కీలక ఒప్పందాలు ఇవే

by Kema Shiva Kumar |

భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ముగిసిన భారత్‌, రష్యా ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం.. కీలక ఒప్పందాలు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌ హౌస్‌ వేదికగా ఇరు దేశాధినేతలు 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. పలు అంశాలపై వీరు చర్చలు విస్తృతంగా చర్చించారు. ఆహార భద్రత, ఆరోగ్య రంగం, వాణిజ్యం, రక్షణ రంగం, కెమికల్స్‌, ఫెర్టిలైజర్స్‌, లేబర్‌ మైగ్రేషన్‌ మొబిలిటీ, పోర్టులు, నౌకాయానంతో పాటు పలు అంశాలపై చర్చించి ఒప్పందాలు చేసుకున్నారు. అనంతరం ఇరు దేశాల నేతల సమక్షంలో వివిధ ఒప్పందాలకు సంబంధించిన పత్రాలను ఆయా దేశాల అధికారులు మార్చుకున్నారు.

Next Story