ఒక్కసారిగా పెరిగిన కరోనా మరణాలు

by Dishanational4 |
ఒక్కసారిగా పెరిగిన కరోనా మరణాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో కొవిడ్ ఇన్ఫెక్షన్‌తో 12 మంది చనిపోయారు. కేరళలో ఐదుగురు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు మరణించారు. దేశవ్యాప్తంగా కొత్తగా మరో 761 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈమేరకు వివరాలతో కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్‌ రిలీజ్ చేసింది. దేశంలో యాక్టివ్‌ కరోనా కేసుల సంఖ్య 4,423 నుంచి 4,334కి తగ్గిందని వెల్లడించింది. అత్యధిక యాక్టివ్ కరోనా కేసులు కేరళ (1,249), కర్ణాటక (1,240), మహారాష్ట్ర (914), తమిళనాడు(190)లలో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌‌లలో 128 చొప్పున యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 కేసులు జనవరి 4 నాటికి 12 రాష్ట్రాల్లో 619 నమోదయ్యాయి. జేఎన్‌-1 కేసులు ఆంధ్రప్రదేశ్‌‌లో 30, తెలంగాణలో 2 బయటపడ్డాయి.



Next Story

Most Viewed