భారత్-పాకిస్థాన్ యుద్ధం.. నార్త్ కొరియా మద్ధతు ఎవరికో తెలుసా?

by D.Reddy |   ( Updated:2025-05-09 07:56:12.0  )
భారత్-పాకిస్థాన్ యుద్ధం.. నార్త్ కొరియా మద్ధతు ఎవరికో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌తో (Operation sindoor) పాకిస్తాన్‌లోని ఉగ్రవాద కేంద్రాలపై దాడి (Attack on terrorist centers) చేసిన సంగతి తెలిసిందే. కానీ, పాకిస్థాన్ మాత్రం సామాన్య పౌరులే లక్ష్యంగా భారత్‌పై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడుతోంది. ఈ దాడులకు భారత రక్షణ వ్యవస్థ విజయవంతంగా ఎదుర్కొంది. అంతేకాదు, భారత త్రివిధ దళాలు ఒక్కటై పాక్‌కు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక ఉగ్రవాద నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్ చేస్తున్న మెరుపు దాడికి ప్రపంచవ్యాప్తంగా మద్ధతు లభిస్తోంది. ఈ విషయంలో పాకిస్థాన్‌కు ఎలాంటి సాయం చేయమని ఇప్పటికే పలు దేశాలు ప్రకటించాయి.

ఈ నేపథ్యంలో నార్త్ కొరియా (North Korea) మద్దతు ఎవరికి ఉంటుందని సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే మెజారిటీ ప్రజలు మాత్రం ఇండియాకే అధ్యక్షుడు కిమ్ (Kim) మ‌ద్ద‌తు ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఎందుకంటే.. 1962 నుంచి నార్త్ కొరియాతో భారత్‌ సత్సంబంధాలనే కలిగి ఉంది. చాలా సందర్భాల్లో ఇరు దేశాలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకున్నారు. 2004లో భారత దేశంలో సునామీ వచ్చినపుడు నార్త్ కొరియా 30 వేల డాలర్ల ఆర్థిక సాయం చేసింది. కరోనా సమయంలో భారత్ నార్త్ కోరియాకు అండగా నిలిచింది. అలాగే, ఇరు దేశాల మధ్య శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వాణిజ్యపరంగా రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సహకారాలు కొనసాగుతోన్నాయి.

ఇక నార్త్ కొరియా, పాకిస్థాన్ మధ్య సంబంధాలను పరిశీలిస్తే.. 1970 నుంచి 1990 వరకు రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా మిస్సైల్, అణు సాంకేతిక రంగాల్లో సహకారం ఉండేది. అయితే, ఈ సంబంధాలు ప్రస్తుతం బలహీనంగా మారాయి. కిమ్ జాంగ్ ఉన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాకిస్థాన్ కంటే.. ఇండియా వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. వీటన్నింటిని పరిగణలోనికి తీసుకుంటే.. మద్దతు అవసరం అన్నపుడు కిమ్ ఇండియా వైపు నిలబడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.



Next Story

Most Viewed