భారత్ -పాక్ కాల్పుల విరమణ.. జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
భారత్ -పాక్ కాల్పుల విరమణ.. జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ పాకిస్థాన్ దేశాల నడుమ తీవ్ర ఉద్రిక్తతల అనంతరం కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ ఒప్పందంలో అగ్రదేశం అమెరికా (America) కీలక పాత్ర పోషించింది. ఒక ఈ కాల్పుల విరమణ పై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Jammu Kashmir CM Omar Abdullah) స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది అప్పుడే జరిగి ఉంటే విలువైన ప్రాణాలు పోయేవి కాదని అన్నారు.

అలాగే భారతదేశం-పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించారు. ఇది 2, 3 రోజుల క్రితం జరిగి ఉంటే, మనం కోల్పోయిన ప్రాణాలు జీవించి ఉండేవని అన్నారు. పాకిస్తాన్ డీజీఎంఓ (Pak DGMO) మా డీజీఎంఓ (Indian DGMO)కు ఫోన్ చేసి కాల్పుల విరమణ అమలు చేశారని చెప్పారు. ఇక కాల్పుల వల్ల జమ్ము కశ్మీర్ లో జరిగిన నష్టాన్ని అంచనా వేయడం, ప్రజలకు సహాయం చేయడం ప్రారంభించడం ప్రస్తుత జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం

=జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలుదీనివల్ల ఎక్కడైతే ప్రజలు గాయపడ్డారో వారికి సరైన చికిత్స అందించడంతో పాటు ప్రభుత్వ తరుఫున సహాయం కూడా చేయాల్సి ఉందన్నారు. అలాగే అగ్నిప్రమాదం చాలా నష్టాన్ని కలిగించిందని, ప్రమాద నష్టం తుది అంచనాను వెంటనే తయారు చేసి, ఆ అంచనాను ప్రభుత్వానికి పంపాలని అధికారులకు సూచించనట్లు తెలిపారు. దీని ద్వారా ప్రమాదంలో ధ్వంసం అయిన ఇళ్లకు సహాయం అందించవచ్చని వెల్లడించారు. ఇక మా విమానాశ్రయం చాలా రోజులుగా మూసివేయబడిందని, కాల్పుల విరమణ తర్వాత విమానాశ్రయం తిరిగి తెరవబడుతుందని ఆశిస్తున్నానని సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.



Next Story

Most Viewed