దేశంలో భారీగా కరోనా కేసులు.. గత 225 రోజుల్లో ఇవే అత్యధికం

by Disha Web Desk 13 |
దేశంలో భారీగా కరోనా కేసులు.. గత 225 రోజుల్లో ఇవే అత్యధికం
X

న్యూఢిల్లీ : గత 24 గంటల్లో దేశంలో 797 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒకే రోజులో ఇంత భారీ సంఖ్యలో కొవిడ్ ఇన్ఫెక్షన్లు బయటపడటం గడిచిన 225 రోజుల్లో ఇదే తొలిసారి. అంతకుముందు 2023 మేలో గరిష్ఠంగా 865 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల మధ్య కరోనాతో ఐదుగురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడుకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు.

ప్రస్తుతం దేశంలో 4,091 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18 మధ్య కరోనా రోగుల నుంచి సేకరించిన శాంపిళ్లలో 145 మందికి కొత్త వేరియంట్ ‘జేఎన్​.1’ సోకిందని తేలింది. ‘జేఎన్​.1’ అనేది ఒమిక్రాన్​సబ్​వేరియంట్. దీనికి సంబంధించిన మొదటి కేసు కేరళలో నమోదైంది. కరోనా కేసులు పెరుగుతున్నందున కొవిడ్ పాజిటివ్​రోగులకు ఏడు రోజుల హోమ్​ఐసోలేషన్‌ను కర్ణాటక ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

Read More..

తిరుపతిలో నలుగురికి కరోనా పాజిటివ్‌

Next Story

Most Viewed