ఆపరేషన్ కావేరిని ప్రారంభించిన భారత్

by Disha Web Desk 12 |
ఆపరేషన్ కావేరిని ప్రారంభించిన భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: సూడాన్‌లో చిక్కుకుపోయిన పౌరులను తరలించడానికి భారతదేశం ఆపరేషన్ కావేరిని ప్రారంభించింది. వివిధ పనుల నిమిత్తం సూడాన్ వెళ్లి అక్కడకు వెళ్లిన వారు.. సైన్యం, పారామిలటరీ బృందం మధ్య ఆధిపత్య పోరు ఫలితంగా అక్కడే చిక్కుకు పోయారు. దీంతో సూడాన్ లో భీకర పోరు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భాతర పౌరులను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం.. 'ఆపరేషన్ కావేరి' ప్రారంభించింది. సుడాన్ నుండి భారతీయ పౌరులను తరలించే ప్రయత్నం జరుగుతోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. సుమారు 500 మంది భారతీయులు పోర్ట్ సూడాన్‌కు చేరుకున్నారు.

మరికొంతమంది వారి మార్గంలో ఉన్నారు" అని జైశంకర్ ప్రస్తుతం కరేబియన్ ప్రాంత పర్యటనలో ట్వీట్ చేశారు. "మా నౌకలు, విమానాలు వారిని స్వదేశానికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. సూడాన్‌లోని మా సోదరులందరికీ సహాయం చేయడానికి కట్టుబడి ఉన్నాము," అని అతను చెప్పాడు. ఐఏఎఫ్‌కి చెందిన రెండు రవాణా విమానాలను సౌదీ అరేబియాలోని జెడ్డాలో, నావికాదళ నౌక ఐఎన్‌ఎస్ సుమేధను పోర్ట్ సూడాన్‌లో ఒంటరిగా ఉన్న భారతీయులను తరలించే ఆకస్మిక ప్రణాళికల్లో భాగంగా ఉంచినట్లు భారత్ ఆదివారం తెలిపింది.

Next Story

Most Viewed