- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచంలో విశ్వసనీయతకు భారత్ నిదర్శనం: ప్రధాని నరేంద్ర మోదీ
ప్రపంచంలో విశ్వసనీయతకు భారత్ నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో జరిగిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలో విశ్వసనీయతకు భారత్ నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో జరిగిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో చెప్పుకొచ్చారు. ఈ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ.. భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక వృద్ధి చోదక శక్తిగా ఎదుగుతోందని ఉద్ఘాటించారు. "ప్రపంచం మందగమనం గురించి మాట్లాడుతుంటే, భారతదేశం వృద్ధి కథను లిఖిస్తోందని, ప్రపంచంలో విశ్వాస సంక్షోభం కనిపిస్తుంటే, భారత్ విశ్వాసానికి ఒక స్తంభం గా మారుతోందని ప్రపంచం ముక్కలై పోతున్న దశలో, భారతదేశం వారధిగా మారుతోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
8% వృద్ధి రేటు కీలక సంకేతం
ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారిస్తూ.. ఇటీవల విడుదలైన క్వార్టర్ 2 జీడీపీ గణాంకాలను ప్రధాని ప్రస్తావించారు. 8% వృద్ధి రేటు అనేది దేశ పురోగతికి కొత్త వేగాన్ని ప్రతిబింబిస్తుందని, ఇవి కేవలం సంఖ్యలు మాత్రమే కాదని, బలమైన స్థూల ఆర్థిక సంకేతాలని ఆయన తెలిపారు. ప్రపంచ వృద్ధి రేటు 3%గా, జీ7 దేశాల సగటు వృద్ధి రేటు 1.5%గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, భారత్ అధిక వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం (high growth and low inflation) యొక్క నమూనాగా కొనసాగుతోందని మోదీ అన్నారు.
దేశ సంభావ్యతను వినియోగించడంపై దృష్టి
భారతదేశ సామర్థ్యంలో పెద్ద భాగం చాలా కాలంగా వినియోగించ బడకుండా మిగిలిపోయింది. దేశంలోని ఈ వినియోగించబడని సంభావ్యతకు (untapped potential) ఎక్కువ అవకాశాలు లభించినప్పుడు, అది పూర్తి శక్తితో, ఎటువంటి అడ్డంకులు లేకుండా దేశ అభివృద్ధిలో పాల్గొన్నప్పుడు, దేశంలో పరివర్తన అనివార్యం," అని మోడీ అన్నారు. తూర్పు భారతదేశంలో ఆధునిక మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, పరిశ్రమల్లో అపూర్వమైన పెట్టుబడులు పెడుతున్నామని, గ్రామాలు, చిన్న పట్టణాలను కూడా ఆధునిక సౌకర్యాలతో సన్నద్ధం చేస్తున్నామని, చిన్న పట్టణాలు స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలకు కొత్త కేంద్రాలుగా మారుతున్నాయని ప్రధాని మోడీ వివరించారు. ఈ ప్రాథమిక మార్పు స్థితిస్థాపకత (resilience), సమస్యలను పరిష్కరించే శక్తిని సూచిస్తుందని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.






