- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Unesco: యునెస్కో తాత్కాలిక జాబితాలో మరో 6 ప్రదేశాలు
యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో మరో 6 ప్రదేశాలు చేరాయి. అందులో తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుమాల్ నిలువురాళ్లకు చోటు దక్కింది.

దిశ, నేషనల్ బ్యూరో: యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో మరో 6 ప్రదేశాలు చేరాయి. అందులో తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుమాల్ నిలువురాళ్లకు చోటు దక్కింది. అంతేకాకుండా.. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని బుండేలాల రాజభవన కోటలు సహా ఆరు ప్రదేశాలను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ తాత్కాలిక జాబితాలో చేర్చిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోమవారం తెలిపారు. ఈ ఏడాది భారత్ చేర్చిన జాబితాలో చత్తీస్గఢ్లోని కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్, తెలంగాణలోని ముడుమాల్ మెగాలితిక్ మెన్హిర్స్, పలు రాష్ట్రాల్లోని అశోకుడి శాసన స్థలాలు, మౌర్య రూట్స్, పలు రాష్ట్రాల్లోని చౌసత్ యోగిని దేవాలయాలు, ఉత్తర భారతంలోని గుప్తుల దేవాలయాలు, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్లలోని బుందేలాల రాజభవనాలు, కోటలు ఉన్నాయని మంత్రి షెకావత్ లోక్సభలో తెలిపారు.
లోక్ సభలో అడిగిన ప్రశ్నకు
పూరీ జగన్నాథ రథయాత్రను యునెస్కో అవ్యక్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చడానికి చొరవ తీసుకోవాలని లోక్ సభలో బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర చేసిన సూచనకు సమాధానమిస్తూ షెకావత్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా.. వీటిని మార్చి 7న తాత్కాలిక జాబితాలో చేర్చినట్లు యునెస్కోలోని భారత శాశ్వత ప్రతినిధి బృందం ఎక్స్లో తెలిపింది. భవిష్యత్ లో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చేందుకు ఆ ప్రదేశం ప్రపంచ వారసత్వ కేంద్రం తాత్కాలిక జాబితాలో ఉండడం అవసరం. ఈ ప్రదేశాల చేరికతో భారతదేశం మొత్తం 62 ప్రదేశాలను యునెస్కో నామినేషన్ కోసం తాత్కాలిక జాబితాను కలిగి ఉంది. ప్రస్తుతం దేశం నుండి మొత్తం 43 ఆస్తులు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు. వాటిలో 35 సాంస్కృతిక, 7 సహజ, ఒకటి మిశ్రమ వర్గం ఆస్తులు ఉన్నాయి. భారతదేశం 2024లో మొదటిసారిగా ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో అసోంలోని అహోం రాజవంశానికి చెందిన మట్టిదిబ్బ-ఖనన వ్యవస్థ అయిన మొయిదమ్స్కు యునెస్కో ట్యాగ్ లభించింది.
Read More..
Gwalior : క్రైం షోలు చూసి హత్య ఎలా చేయాలని రీసెర్చ్.. ఆఖరికి ఏం జరిగిందంటే?






