- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IND PAK War: భారత్తో యుద్ధంపై పాక్ మాజీ హైకమిషనర్ సంచలన ట్వీట్
పాకిస్థాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ సంచలన ట్వీట్ చేశారు. రష్యా విక్టరీ డే తర్వాత భారత్.. పాకిస్థాన్ పై దాడి చేసే అవకాశం ఉందని అందులో రాసుకొచ్చారు.

దిశ, వెబ్డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ - పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పాక్ పై యుద్ధం చేసేందుకు భారత్ సరైన సమయం కోసం ఎదురుచూస్తుందని ఇప్పటికే కొన్ని వర్గాలు వెల్లడించాయి. అందుకు తగ్గట్టుగానే దేశమంతా రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ సిద్ధమైంది. ఈ క్రమం పాకిస్థాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ సంచలన ట్వీట్ చేశారు.
రష్యా విక్టరీ డే తర్వాత భారత్.. పాకిస్థాన్ పై దాడి చేసే అవకాశం ఉందని అందులో రాసుకొచ్చారు. మే9న రష్యా విక్టరీ డే వేడుకలు జరగనున్నాయి. ఆ మర్నాడే.. అంటే మే 10, 11 తేదీల్లో భారత్ తమ దేశంపై దాడి చేయవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్ ఏ క్షణాన్నైనా దాడి చేయవచ్చని భావిస్తున్న పాక్.. క్షిపణులతో సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ అత్యున్నత వర్గాలు సైతం ఈ వారాంతంలోగా ఎప్పుడైనా పాక్ పై భారీ స్థాయి ఆపరేషన్ జరగవచ్చని చెబుతున్నాయి.






