ఇన్‌కమ్‌టాక్స్ రైడ్స్.. ₹1,700 కోట్ల విలువైన బినామీ డీల్స్, నగదు

by Disha Web Desk 12 |
ఇన్‌కమ్‌టాక్స్ రైడ్స్.. ₹1,700 కోట్ల విలువైన బినామీ డీల్స్, నగదు
X

దిశ, వెబ్‌డెస్క్: ధనేరా డైమండ్స్, భావ రత్నాలు అనే రెండు కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రెండు కంపెనీలకు చెందిన రూ. 15 కోట్ల విలువైన నగదు ఆభరణాలు స్వాధీనం చేసుకుంది. అలాగే వీరికి సంబంధించిన సంస్థలు, రియల్ ఎస్టేట్ మార్కెట్ మధ్య ₹ 1,700 కోట్ల విలువైన 'బినామీ' డీల్‌లను వెల్లడించే పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. కాగా ఈ దాడులు సూరత్, ముంబైలోని 30 ప్రాంతాల్లో డిసెంబర్ 2న ప్రారంభమైనాయి.

ఇవి కూడా చదవండి : ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. ఈడీ అదుపులో ఎంపీ సోదరుడు?

Next Story

Most Viewed