లక్షద్వీప్‌లో ప్రధాని మోడీ సాహసం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు

by Disha Web Desk 1 |
లక్షద్వీప్‌లో ప్రధాని మోడీ సాహసం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా లక్షద్వీప్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భాగంగా అక్కడ రూ.1,150 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే లక్ష ద్వీప్‌లో స్నార్కెలింగ్‌ను ఆస్వాదిస్తున్న ఫోటోలను ఇవాళ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అక్కడి బీచ్‌లో వాకింగ్, సముద్రాన్ని చూస్తూ కూర్చుని ఉన్న ఫోటోలు షేర్ చేశారు. సాహసం చేయాలనుకునే వారి లిస్ట్‌లో లక్షద్వీప్‌లో ఉండాలని ప్రధాని పేర్కొన్నారు. లక్షద్వీప్ ప్రకృతి అందాలతో పాటు అక్కడి ప్రశాంత వాతావరణానికి మైమరచిపోయానని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణం 140 కోట్ల మంది సంక్షేమం కోసం కష్టపడి ఎలా పని చేయాలో ఆలోచించే అవకాశాన్ని కల్పించిందని తెలిపారు. కాగా, అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి.


Next Story

Most Viewed