'దళితుణ్ని డిప్యూటీ సీఎం చేయకుంటే కష్టం'.. కాంగ్రెస్‌ను హెచ్చరించిన సీనియర్ నాయకుడు

by Disha Web Desk 13 |
దళితుణ్ని డిప్యూటీ సీఎం చేయకుంటే కష్టం.. కాంగ్రెస్‌ను హెచ్చరించిన సీనియర్ నాయకుడు
X

బెంగళూరు: దళితుడికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ కు కష్టాలు తప్పవని ఆ పార్టీ సీనియర్ నాయకుడు జి. పరమేశ్వర హెచ్చరించారు. 71 ఏళ్ల దళిత నాయకుడు పరమేశ్వర కాంగ్రెస్-జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పని చేశారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అత్యధిక కాలం (8 ఏళ్లు) పని చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. సిద్ధరామయ్య కర్ణాటక సీఎంగా, డి.కె.శివకుమార్ డిప్యూటీ సీఎంగా నియమితులైనట్లు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించిన నేపథ్యంలో పరమేశ్వర ఈ హెచ్చరిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా తనను ఒక్కడినే నియమించాలని డి.కె. శివ కుమార్ షరతు విధించడం ఆయన వైపు నుంచి సరైనదేనని.. కానీ పార్టీ హైకమండ్ వైపు నుంచి సరికాదని పరమేశ్వర చెప్పారు.



Next Story

Most Viewed