బీజేపీతో పొత్తు కన్నా చావే మేలు.. బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 12 |
బీజేపీతో పొత్తు కన్నా చావే మేలు.. బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
X

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరిగి బీజేపీతో పొత్తు కూడటం కన్నా చనిపోతానని అన్నారు. తన డిప్యూటీ‌పై బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగా ఎలాంటి ఆధారం లేకుండా కేసులు పెట్టిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ 36 నుంచి 40 లోక్ సభ సీట్లు గెలుస్తుందనే వాదనను ఆయన కొట్టిపారేశారు.

హిందుత్వ భావజాలం ఉన్న బీజేపీ ముస్లింలతో సహా తన మద్దతు దారులందరి ఓట్లను తాము మిత్రపక్షంగా ఉన్నప్పుడు పొందేదని విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. మరోవైపు నితీష్ కుమార్‌తో పొత్తు పెట్టుకోమని బీజేపీ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నితీశ్ కుమార్ దానికి కౌంటర్ ఇచ్చారు. గతేడాది బీజేపీతో పొత్తును వీడి ఆర్జేడీతో నితీశ్ జట్టు కట్టిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed