తమిళనాడులో G స్క్వేర్ ప్రాంగణంలో I-T దాడులు.. DMK కార్యకర్తల ఆందోళన

by Disha Web Desk 12 |
తమిళనాడులో G స్క్వేర్ ప్రాంగణంలో I-T దాడులు.. DMK కార్యకర్తల ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో రియల్ ఎస్టేట్ సంస్థ జీ స్క్వేర్‌లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. తమిళనాడులోని చెన్నై సహా పలు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. దీంతో ఈ దాడులకు నిరసనగా DMK కార్యకర్తల ఆందోళన పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు.. అన్నమలై DMK ఫైల్స్ పేరుతో.. డీఎంకే ఎమ్మెల్యే G స్క్వేర్ తో కలిసి పెట్టుబడులు పెట్టినట్లు వీడియో ను విడుదల చేశారు. కాగా దీనిపై బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్ధం నడిచింది. తాజాగా జి స్క్వేర్‌ సంస్థలో వాటాదారుగా ఉన్న అన్నానగర్ డీఎంకే ఎమ్మెల్యే ఎంకే మోహన్ కుమారుడు ఇంటిపై ఏజెన్సీ దాడి చేయడంతో డీఎంకే నేతలలో ఆందోళన మొదలైంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed