రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలుస్తుంది : అశోక్ గెహ్లాట్

by Disha Web Desk 13 |
రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలుస్తుంది : అశోక్ గెహ్లాట్
X

జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారం చేపడుతుందన్న ఆశాభావాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యక్తం చేశారు. అయితే.. పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పోరాడితేనే ఇది సాధ్యం అన్నారు. కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ పై ప్రశ్నను దాటవేసిన గెహ్లాట్.. పార్టీలో ప్రతి ఒక్కరూ హైకమాండ్ నిర్ణయాన్ని ఆమోదించాలని సూచించారు.

ఈ నెలాఖరులోగా తన డిమాండ్లు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతానని సచిన్ పైలట్ ఈ నెల 15వ తేదీన హెచ్చరించడంతో పార్టీలో లుకలుకలు బహిర్గతమయ్యాయి. గెహ్లాట్ కంటే ముందు సీఎంగా ఉన్న బీజేపీ నాయకురాలు వసుంధర రాజే పాలనలో జరిగిన కుంభకోణాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని సచిన్ పైలట్ డిమాండ్ చేస్తున్నారు. రాజస్థాన్ కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభంపై త్వరలో ఢిల్లీలో సమావేశం నిర్వహించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది.



Next Story

Most Viewed