- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్రంలో బీజేపీ ఎంతకాలం అధికారంలో ఉండగలదు?
కేంద్రంలో బీజేపీ తెరుగులేని శక్తిగా అవతరించింది. వరుసగా మూడుసార్లు లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఎన్డీయే ఇంకా ఎంతకాలం అధికారాన్ని చేపట్టగలదు?

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రంలో బీజేపీ తెరుగులేని శక్తిగా అవతరించింది. 2014లో అధికారాన్ని చేపట్టిన ఎన్డీయే వరుస విజయాలతో అజేయంగా నిలుస్తున్నది. ఇప్పటికే వరుసగా మూడుసార్లు లోక్సభ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన ఎన్డీయే ఇంకా ఎంతకాలం అధికారాన్ని చేపట్టగలదు? ఏ పార్టీ అయినా ఏదో ఒక రోజు ఓటమి చెందకతప్పదు. శాశ్వత అధికారం అసాధ్యం. ఈ అంశాలపై యాక్సిస్ మై ఇండియా వ్యవస్థాపకుడు ప్రదీప్ గుప్తా తన సంచలన అంచనాలు వెల్లడించారు. చాలా ఎన్నికల అంచనాలను సరిగ్గా అంచనా వేసిన యాక్సిస్ మై ఇండియా సంస్థ మొన్న బెంగాల్ ఎన్నికల్లో నాడీ దొరకలేదని అంచనాలు వెలువరించలేదు. అలాగే, తమిళనాడు ఎన్నికల ఫలితాలను సరిగ్గా అంచనా వేసిన ఏకైక సంస్థ కూడా కావడం గమనార్హం.
అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు బీజేపీ
స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ డామినెన్స్తో పోల్చుతూ బీజేపీకి కూడా ఇప్పుడు అలాంటి ఆదరణే ఉన్నదని ప్రదీప్ గుప్తా వివరించారు. కాంగ్రెస్లాగే దీర్ఘకాలం అధికారాన్ని చేపట్టే స్థాయికి బీజేపీ చేరుకుందని తెలిపారు. అయితే ప్రతిపార్టీకి ఒక పతాకస్థాయి వచ్చి మళ్లీ పరాజయాన్ని చవిచూసే స్థితి ఉంటుందని వివరించారు. ‘గతంలో కాంగ్రెస్ 1977 వరకు నిరాటంకంగా పాలన చేపట్టింది. ఆ తర్వాతే దానికి కష్టాలు ఎదురయ్యాయి. ఆ రోజుల్లో ఒక పొలిటికల్ 20 ఏళ్లు కొనసాగుతుందని మాట్లాడుకునేవాళ్లు. ఆ 20 ఏళ్ల సైకిల్ ఇప్పటికీ వర్తిస్తుంది’ అని చెప్పారు. 2014లో అధికారాన్ని చేపట్టిన బీజేపీ కూడా 20 ఏళ్లు అధికారంలో ఉండొచ్చని అంచనా వేశారు. అయితే, అది పూర్తిగా దాని పర్ఫార్మెన్స్పై ఆధారపడి ఉంటుందన్నారు. ‘విస్తృత ప్రజామోదం వచ్చాక బీజేపీపై అంచనాలు, ఆశలు పెరిగాయి. కాబట్టి, బీజేపీ, ఎన్డీయే ఇక నుంచి సూపర్ పర్ఫార్మ్ చేయాలి. వారి పాలన, పర్ఫార్మెన్స్ వీక్ కానంతవరకు, వారు గెలుస్తూనే ఉండొచ్చు. ప్రతిపక్షాలు ఓటములు ఎదుర్కొంటూనే ఉండాల్సి వస్తుంది’ అని వివరించారు. కాంగ్రెస్ ప్రస్తుతం లెగసీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నదన్నారు. గతకాలంలో ఆ పార్టీ పాలనలో చోటుచేసుకున్న కొన్ని తప్పిదాల ఫలితాలను ఎదుర్కొంటున్నదని, వాటి నుంచి రికవరీ కావడానికి ఎక్కువ సమయం పడుతున్నదని తెలిపారు.
2029లోనూ బీజేపీనే..
‘2029 ఎన్నికల గురించి మాట్లాడితే.. అంటే కాంగ్రెస్ అధికారానికి దూరమై 15 ఏళ్లు. ఈ దేశ ప్రజలను వారు కన్విన్స్ చేయడానికి వారికి మరో ఐదేళ్ల కాలం అవసరమవ్వొచ్చు’ అని ప్రదీప్ గుప్తా తెలిపారు. అయితే, ఒకసారి పీక్స్కు వెళ్లాక వారిపై ప్రజల నుంచి అంచనాలు పెరుగుతాయని, అలాగే, వెంటనే పడిపోయే ముప్పూ ఉంటుందని వివరించారు. ‘మీరు గొప్ప స్థాయిలకు చేరినప్పుడు వెంటనే కిందపడిపోయే ప్రమాదముంటుంది. అంచనాలు భారీగా పెరిగిన స్థితికి బీజేపీ నేడు చేరుకుంది. వాళ్లు సూపర్ పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది’ అని తెలిపారు.






